Tuesday, November 2, 2010

ణాత్మక భావవాది : అన్నమయ్య -వెంకటేశ్వరస్వామిని అమ్ముకుని బతికేపూజారులను అధికారులను మనం ఇవాళ చూస్తున్నాం. అయితే వెంకటేశ్వరస్వామినినమ్ముకుని మాత్రమే బతికిన కవి తాళ్ళపాక అన్నమాచార్యుడు.అన్నమయ్య భక్తకవి.అయితే ఆయన ఏనాడూ సమాజాన్ని విస్మరించి మాట్లాడలేదు. ఆయనది భావవాదమే .సృష్టి కర్త మీద విశ్వాసం ఉన్న కవే.“కుమ్మరి వాడులేకే కుండ లేబుట్టేనానెమ్మినీవు పుట్టించక నేనే బుట్టితినా”“అతని మూలమే జగమంతానిది”అని గట్టిగా నమ్మినకవి అన్నమయ్య. అన్నిటికే విష్ణువునే కర్తగా నమ్మినఅన్నమయ్య సంఘంలోని ఆనారోగ్యకర ధోరణులను ఎత్తి చూపడానికే నిరంతరం కృషిచేసాడు. సామాజిక రుగ్మతలన్నిటినే హరి భక్తే సరైన మందని భావించి, దానినేప్రచారం చేశాడు. అది మందు అవునా కాదా అన్నాదానిమీద భావ, బౌతిక వాదుల మధ్యఅభిప్రాయ భేదాలున్నాయి. అయితే ఆరువందల ఏళ్ళ క్రితమే ప్రజల భాషలో , ప్రజలవాణిలో సామాజిక రుగ్మతలను ఎత్తి చూపిన కవిగా అన్నమయ్యను గుర్తించాలి.రోగనిదానం సరిగ్గానే చేసిన అన్నమయ్య వైద్యం దగ్గరికి వచ్చేసరికిభావవాదంలో పడిపోయాడు. అది వేరే విషయం.హిందూమతం, మనువాదం - వీటి భౌతిక స్వరూపమైన వర్ణ - కుల వ్యవస్థ. దీనికిఆధిపత్యం వహించే భూస్వామ్య వర్గం - దీని స్వార్థం - ఇవి సమాజానికితెస్తున్న కీడూ - వీటిని అన్నమయ్య జాగ్రత్తగా గుర్తించాడు. ఆస్థాన కవులుకీర్తించే రాచరికాన్ని అన్నమయ్య ధిక్కరించాడు. అస్థాన కవులు కీర్తించేకుల వ్యవస్థను అన్నమయ్య తిరస్కరించలేదుగాని, కుల వివక్షనువ్యతిరేకించాడు. మనువాదం భారతీయ సమాజాన్ని కులసమాజంగా స్థిరీకరించి అధిభ్రష్టుపట్టిపోయిన దశలో, విదేశీ పాలకులు భారత దేశంలో స్థిరపడి వాళ్ళమతాలకు అనుగుణంగా ప్రజల్ని మల్చుకొనే క్రమంలో హిందూ మతం బలహీనపడుతున్ననేపథ్యంలో, జనం కుల ప్రాతి పదికన, దైవారాధన ప్రాతిపదికన చీలిపొయి జాతినిర్వీర్యమౌతున్న సమయంలో అనేక దైవారాధనాలతో జనం చీలిపోతున్న సందర్భంలోఅన్నమయ్య చలించిపొయి కలం పట్టాడు.ఏ దేవుని పేరు చెప్పి మనువు వర్ణ వ్యవస్థను శాశ్వతం చేశాడో, ఆ దేవునిమీది భక్తితోనే అన్నమయ్య వర్ణవివక్షను వ్యతిరేకించాడు. దేవుడుమంత్రానికి, బ్రాహ్మణులకు ఆధీనులనే వాదాన్ని తిరస్కరించి దేవుడూభక్తాధీనుడని చాటాడు అన్నమయ్య. ఒక రకంగా అన్నమయ్య దేవుని అల్పసంఖ్యాకులచెరనుంచి తప్పించి సార్వజనికం చేశాడు. దేవుని మానవీకరించాడు. భారత దేశవ్యాప్తంగా మధ్య యుగాలలో భక్తి ఉద్యమం ఉప్పెన గా వచ్చింది. ఆంధ్ర దేశంలోఅన్నమయ్య ఆ ఉద్యమ ప్రతినిధి. భక్తకవులు భక్తులుగా ఉంటూనే సమాజంలోసంస్కరణలను ప్రతిపాదించారు. నిలవనీటి మడుగుగా ఉన్న సమాజానికి ప్రవాహ గుణంతీసుకొచ్చాడు. అన్నమయ్య వెంకటేశ్వరుని మీద భక్తిని అన్ని రోగాలకు మందుగాప్రచారం చేశాడు. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న అన్నమయ్యకు అవసరంలేదు. అన్నమయ్యకు దేవుడున్నాడు .ఆయన సృష్టిలో ఆర్థిక అసమానతలు, సాంఘీకవివక్షలు, స్వార్థం వంటి రుగ్మతలకు చోటు లేదని ఆయన భావించాడు . అందుకోసంతన పదాలలో సంస్కరణ భావాలను ప్రచారం చేశాడు.దేశంలో అనేక దేవతారాధనలు కొనసాగుతున్న సమయంలో బయటి నుంచి ఏకేశ్వరోపాసనచేసే మతం ప్రవేశించింది.అందువల్ల హిందువులలో ఏకేశ్వరోపాసనను ప్రచారంచెయ్యవలసిన చారిత్రక అవసరం ఏర్పడింది. అన్నమయ్య ఆ అవసరాన్ని గుర్తించి“బ్రహ్మమొక్కటే” అని నినదించాడు. కుల వ్యవస్థ విస్తృత రూపాన్నిసంతరించుకొని, నిరంకుశమై ప్రజల మధ్య సహజంగా ఉండవలసిన సంబంధాలువిచ్ఛిన్నమై ఆర్థిక వైరుధ్యాలు ఏర్పడిన సమయంలో అన్నమయ్య బాధ్యతాయుతమైనపాత్ర నిర్వహించాడు.” జంతు కులమంతా నొకటే ” అని సిద్ధాంతం చేశాడు అన్నమయ్య. “సానుజాతమయ్యేసకల కులము ” అని వేమన అనడానికి 250 ఏళ్ళకు ముందే అన్నమయ్య అన్నాడు. రాజునిద్ర, బంటు నిద్ర ఒకటేనని , బ్రాహ్మణుడు, చండాలుడు తిరిగే నేల ఒకటేనని,దేవతలకు , పశువులకు కామ సుఖమొకటేనని, ధన వంతునికి, పేదవానికిరాత్రింబవళ్ళు ఒక్కటేనని, శిష్టాన్నానికి దుష్టాన్నానికి ఆకలి ఒకటేననిదుర్వాసనను, సువాసనను మోసే గాలి ఒకటేనని, ఏనుగు మీద, కుక్క మీద పడే ఎండఒకటేనని - ఇలా ప్రకృతి లో లేని వివక్ష సంఘంలో ఉండకూడదని ప్రబోధించాడుఅన్నమయ్య.కర్మ పేరు చెప్పి , దైవం పేరు చెప్పి విస్తృత మానవాళి జీవితాన్ని తమగుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకొనే పురోహితచర్యకు ప్రతి చర్య అన్నమయ్యకవిత్వం.” బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడుతన్ను తానెరిగిన దానెబో బ్రహ్మంబు ” అని వేమన చెప్పకముందే అన్నమయ్య“మనసున నమ్మనేర్చితే మనుజుడే దేవుడంచుతనలోనె వున్న వాడు తావు లేని దైవము”అని చాటాడు. ఆత్మ సకల వ్యాపకమని అనుకుంటే జాతి, కుల అభిమానాలను గురించిచర్చించవలసిన అవసరమే లేదని చాటాడు.“కులముకన్న మిగులగుణము ప్రధానంబు” అని వేమన చాటకముందే , అన్నమయ్య“కొంచెమును ఘనముంగనుకొననేల ? హరిందలంచుపంచ మహాపాతకుండె బ్రహ్మణోత్తముండు”అని ప్రకటించాడు. కులానికి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అన్నది క్రీ.శ.15 శతాబ్దం నాటికి విప్లవాత్మకమైన ఆలోచన. నన్నయ్య తన భారతంలోఉదంకోపాఖ్యానంతో ” నిండుమానంబు” పద్యంతో కులాన్ని బట్టి గుణ ముంటుందనిచెప్పాడు. దీనిని అన్నమయ్య తిరస్కరించాడు. కుల వ్యవస్థ సృష్టించినసంఘర్షణను తగ్గించడానికి అన్నమయ్య వెంకటేశ్వర భక్తిని సాధనంగాచేసుకున్నాడు. అగ్ర వర్ణాల వాళ్ళను ఆధిపత్య భావననుంచి, కిందికి దించి .కింది కులాల వాళ్ళను ఆత్మన్యూనతనుంచి పైకిలాగి, ఇద్దరినీ ఒకేకేంద్రబిందువు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అన్నమయ్య.మల్లికార్జున రాయలును, అతని పినతండ్రి కొడుకును విరూపాక్షరాయలు, ఇతనినిఇతని పెద్ద కొడుకు, ఈ పెద్ద కొడుకును తమ్ముడు ప్రౌఢ రాయలు, ఇతనిని సాళువనరస నాయకుడూ చంపి రాజ్యధికారాలను హస్తగతం చేసుకున్నాడు. ఈ రక్త చరిత్రనుఅన్నమయ్య చూశాడు. అధికారం కోసం , అందలం కోసం హత్యలకూ వెనుకాడని రాజులదుర్మార్గాలను సహించలేదు అన్నమయ్య.“వెఱుతు వెఱుతు నిండు వేడుక పడనిట్టికుఱుచ బుద్ధులనెట్లు గూడుదురయ్యదేహమిస్తున్నవాని దివిడి చంపెడువాడుద్రోణి గాక నేడు దొరయటతోడబుట్టిన వాని తొడరి చంపెడువాడుచూడ దుష్టుడు గాక సుసృతియుట……కొడుకు నున్నతమతిగోరి చంపేడు వాడుకడుపాతకుడుగాక ఘనుడటతల్లి జంపెడువాడు తలప దుష్టుడుగాకయెల్లవారల కెల్ల నెక్కుడట….అని అధిక్షేపించాడు అన్నమయ్య. సాళువనరసింహుని ఆఙ్ఞను ధిక్కరించిన ఘనత అన్నమయ్యది.స్వార్థం , కపటం , అత్యాశవంటి దుష్టలక్షణాలు మన సమాజంలో అన్నమయ్యకాలానికే ముదిరిపోయాయి. ఆ సంఘాన్ని అన్నమయ్య సంస్కరింప బూనుకొని కొన్నివందల సూక్తులను రూపొందించాడు. అప్పటి సమాజంలో కులం, ధనం సృష్టిస్తున్నవైరుధ్యాలను అన్నమయ్య గమనించాడు. ఆ రెండు ఆధిక్యతలు మంచివి కావని చాటాడు.” కులమెంత గలిగిన కూడించు గర్వంబుధనమెంత గలిగెనది దట్టమౌలోభంబుఘన విద్య గలిగినను కప్పు పైపై మదముసిరులెన్ని గలిగినను చింతలే పెరుగు”వేదాంత ప్రవాననాల బరువుతో మన చానెళ్ళు మనల్ని గూనివాళ్ళుగా తయారుచేస్తున్నాయి. ఆచరణ సాధ్యంగాని వేదాంతం చెప్పడంలో భారతీయ వేదాంతాలుప్రపంచంలోనే అగ్రగ్రాములు. ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళు చాలా నేలబారుమనుషులుగా మిగిలిపొతారని ఇటీవల అనేక సంఘటనలు రుజువు చేశాయి ఇలాంటివాళ్ళను“చెవ్ప్పుడుమాటలే చెప్పుగొనుటగాకచెప్పినట్లు దాము సేయరెవ్వరును “అని అన్నమయ్య ఆనాడే దెప్పిపొడిచాడు. నాటి సమాజానికి ఇదొక జాటి దెబ్బ, ఒకములుగర్రపోటు. ఇతరులకోడును నిరంతరం కోరేవాళ్ళు, ఇతరుల కష్టాలు కలిగించేవాళ్ళు , ఇతరులకు కష్టాలు కలిగితే సంతోషించే వాళ్ళు మనకు కనిపిస్తారు.వాళ్ళలో ఈర్ష, అసూయ, ద్వేషం వంటి దౌర్జన్యాలు పుష్కలంగా ఉంటాయి.అన్నమయ్యఈ రకం జనానికి కూడా రాత పెట్టాడు. వాళ్ళ జన్మే వృధా అనే దాకా వెళ్ళాడుఅన్నమయ్య.పరుల మనసునకు నాపదగలుగజేయబరితాపకరమైన బ్రదుకేలా!సొదిదినితరుల మేలు చూసి సైపగలేకతిరుగుచుండేటి కష్టదేహమిద్యేలా?ఆర్థిక వైరుధ్యాలను అన్నమయ్య ఏ మాత్రం సహించనట్లు కనిపించడు. భూస్వామ్యవ్యవస్థకు ఆర్థిక సాంఘిక అసమానతలు రెండుకళ్ళు. వీటిని అన్నమయ్యనిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. కొంత మంది జీవితం కష్టాలమయం , మరికొందరికి సుఖాలజాలం కావడాన్ని ఆయన గమనించాడు.” పాటెల్ల నొక్కచోనుండు, భాగ్యమెక్కచోనుండుయీటువెట్టి పెద్ద తనం వెంచబనిలేదు”“అతి సంపదలు దేహన ఙ్ఞానిసేయుఅన్న ,మదమున చిత్తమగపడదు”అన్ని అన్నమయ్య ఆర్థిక కేంద్రీకరణ దుష్పలితాల పట్ల అనాడే హెచ్చరించాడు.భారతీయే వేదాంతం భారత జాతిలో సోమరితనాన్ని పెంచిన మాట వాస్తవం.కర్మ,జన్మ,పునర్జన్మల సిద్ధాంతం మనిషిని కర్తవ్య విముఖున్ని చేసింది.ప్రజల శ్రమ మీద ఆధారపడి బతికిపోయే సోమరిపోతుల్ని కూడా స్పష్టించింది.కొందరు కష్టపడి సృష్టిస్తుంటే కొందరు కూర్చొని తినే వాళ్ళుగ తయారయ్యారు.అలాంటి వాళ్ళనూ చూశాడేమో అన్నమయ్య.“మహినుద్యోగి గావలె మనుజుడైన వాడు” అని భోధించాడు. అదే సమయంలో అన్నమయ్యసుఖాల కోసం పరుగు పెట్టే భోగలాలసులకు వైరాగ్యాన్ని కూడా బోధించాడు.సంపాదన కోసం దేశాన్ని తాకట్టు పెట్టాడానికి, అమ్మేయడానికి, దేశరహస్యాలుబయట దేశాలకు అందించడానికి వెనకాడని దశకు మనం చేరుకున్నాం. పెళ్ళిళ్ళలోవిందులలో దుర్భరమైన భోజనాలు, అవసరానికి మించిన అంతస్తుల భవనాలు, వేదాంతంబోధించే బాబాలకు ఎకరాల కొలదే భనవాలు , సిగ్గూ , మర్యాదలు పోయినా ఫరవాలేదుధన వంతులైపోతే చాలు- ఇలా ఉంది నేటి మనుషుల తీరు. ఈ బాపతు జనాలకు అన్నమయ్యఏమైనా బోధించాడా అని వెతికితే ఈ పదం దొరికింది.అప్పులేని సంసారమైనపాటేచాలుతప్పులేని జీతమొక్కతారమైన జాలు”కంతలేని గుడిశెక్క గంపంతయినజాలుచింతలేని యంబలొక్క చారడేచాలుజంతగాని తరుణి యే జాతైన నది చాలువింతలేని సంపదొక్క వీసమేచాలు”తిట్టులేని బ్రతుకొక్కదినమైన నదెచాలుముట్టులేని కూడొక్క ముద్దడే చాలుగుట్టుచెడి మనికంటే కొంచెపుమేలైనచాలువట్టిజాలి బడుకంటే వచ్చినంతేమేలు…..భౌతికవనరుల మీద పెత్తనానికి దేశాలు, రాజ్యాలు , కులాలు , వర్గాలు పోటీపడుతున్న స్వార్థపరులు ఈ పదాన్ని చదువుతారా? వెంకటేశ్వరస్వామి చుట్టూమూగి నానాయాగీ చేస్తున్న వాళ్ళు ఆయన పేరు మీద అన్నమయ్య రాసిన ఈ పదాన్నిచదువు తున్నారా? మనిషి కోసం సంపదగాని, సంపదకోసం మనిషి కాదన్నవాస్తవాన్నిప్రపంచీకరణ జ్వరంలో పడికొట్టుకుపోతున్న వాళ్ళు గమనిస్తారా? నాబోటినాస్తికులకు అన్నమయ్య పదంలోని పధ్నాలుగు పంక్తులలో చివరి రెండు పంక్తులతోపేచీ ఉండవచ్చు . తక్కిన పంక్తులతో ఆయన లొకరీతినే చాటాడు.అన్నమయ్య తాత్వికంగా భావవాదికవిగా సంస్కరణవాది.

Tuesday, October 5, 2010

తల్లి గోదారి
వెంకటేష్
శుక్రవారం, అక్టోబర్ 1, 2010, 9:57[IST]
తల్లి గోదావరి గల గలా వస్తోంది. రోజు తనకు పిండాలనే తిండి పెట్టేపంతులు పరమపదించాడు.వాడి ఆత్మ శాంతికై కాటన్ దొరతో చెప్పిఒడ్డునున్న ప్రజలందరికీ అన్న దానం చేయించింది.విరగబడి ప్రజలు విందారగించారు.మిగతా నదులన్నిటి స్థితి ఇలాగే! పంతులు పిల్లలు దిక్కు లేక దీనంగా చావలేక బ్రతుకీడుస్తూ మంచి చదువులు చదివి పిండాల చదువు రాక వేరే ఉద్యోగం లేక దీనంగా గోదారి చేరారు.ఓ పిల్లలారా మీ కష్టాలకు ధనసాయం చేస్తే చెతకాని వాళ్ళలామిగులుతారులెండి. మీరంతా ఏకం కండి. విప్లవ మూర్తులై ఉద్యోగ విద్యా సాధనలోరిజర్వేషన్లు చేయించుకోమనితల్లి గోదారి ఉప్పెనతో పిలుపునిచ్చింది.

Monday, October 4, 2010

అన్నాబావు సాఠే





భారతీయ గోర్కీ అన్నాబావు సాఠే !

- అట్టడుగునుంచి అత్యున్నత స్థాయికి
- ప్రజాకళకు, సాహిత్యానికి మార్గదర్శి
- తెలంగాణ సాయుధ పోరాటంపై ఒగ్గుకథ
- సామాజిక న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం

Anna_Bhau_Satheగ్రామీణ ప్రాథమిక విద్యాభ్యాసం అరకొరగా సాగించి, ఏ వంశ పారంపర్య సాహిత్య సాంస్కృతిక వాతావరణ మద్దతు లేకుండా, ఖూనీకోరుగా పోలీస్‌ రికార్డుల్లో బ్రిటిష్‌ సర్కార్‌ చిత్రించిన సంచార జాతికి చెందిన ఒక నిమ్న కుల వర్గీయుడు భారత దేశ సాహిత్య అకాడమీ అవార్డు పొంది, సోవియట్‌ యూనియన్‌ గుర్తింపు స్థాయికి ఎదిగి, భారతదేశ మ్యాక్సిం గోర్కీగా పేరు సంపాదించడం ఊహించలేని అంశం. మరాఠీ సాహిత్యం ద్వారా ప్రగతిశీల, దళిత, బహుజన వర్గాల కు ఎంతో అభిమాన పాత్రుడు, చిరస్మరణీయుడు, అగ్రశ్రేణి సాహితీకారుడు అన్నాబావు సాఠే. ఆయన జన్మదినం 1920 ఆగస్టు1న. అతి తక్కువ వ్యవధిలో అమూల్యమైన సాహిత్యాన్ని సృష్టించి 50 ఏళ్ళ వయసులోపునే 1969 జులై 18న అస్తమించిన రేపటి వెలుగు చుక్క.

మహారాష్టల్రోని సాంగీ జిల్లా వాఠేగావ్‌లో బావూ- వాలూబాయి దంపతులకు అన్నాబవు జన్మించాడు. అతి శూద్ర కుల వర్గానికి చెందిన మాంగ్‌ (మాతం గ్‌) అనే నిమ్నజాతిలో పుట్టినందున వారికి నిర్దిష్ట వృత్తి పని కూడా లేదు. బావూ నానా కష్టపడి విధిలేక ముంబాయికి ఒక్కడే వెళ్ళి గ్రామంలో వదలి వెళ్ళిన తన కు టుంబాన్ని ఏదో ఒక రూపంలో పోషిం చాడు. బావూకు ఐదుగురు సంతానం. వారిలో ఒకరు చిన్ననాడే మరణించా డు. మొదటి సంతానం కుమార్తె. పేరు బాగూబాయి. తర్వాత అన్నాబావు, శం కర్‌, జారుూబాయి జన్మించారు. బాల్యంలో అన్నాబావును తుకారాం అని పిలిచేవారు. కాని తర్వాత అందరూ ప్రేమతో అన్నా అనే పేరుతో పిలవడం వలన అదే పేరు స్థిరపడింది.

ఫకీరా అనే వ్యక్తి అన్నాబావు మామ- బ్రిటిష్‌ వారికిపై తిరుగుబాటు చేపట్టాడు. ఆయన ప్రభా వం చిన్న వయసులో అన్నా బావుపై పడింది. అన్నా విద్యాభ్యాసం రెండవ తరగతి వరకు జరిగిందని కొందరు, లేదు ఏడవ తరగతి వరకు కొనసాగిందని మరికొందరు పరిశోధకులు వాదించారు. కాని నేటికీ వాటికి సరియైన ఆధారాలు లభించడం లేదు.బాల్యంలో అన్నా ఊరిలో, ఊరవతల జరిగే జాతరలలో పాల్గొని అక్కడి సాహిత్య, సాంస్కృతిక, క్రీడా రంగాలలో ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. దానితో ఆయనకు ప్రజా గేయాలు, ఒగ్గు కథలు, జానపద, పురాణ, వీరగాథలు, వేట కథలు, సాహస కృత్యాలపై మక్కువ పెరిగింది.

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన క్రాంతి వీరుడు నానాపాటిల్‌ ఉద్వేగ ఉపన్యాసం ఆయనపై బలంగా ప్రభావం చూపింది. దీంతో వారితో కలిసి అజ్ఞాతవాస కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అన్నా బావు తల్లి ఈ పరిస్థితిని గమనించి వెంటనే తమ కుటుంబాన్ని ముంబాయికి రప్పించుకొమ్మని వినతి చేసింది. దానితో బావూ కుటుంబం మొత్తం నానా కష్టాలు పడి (సతారా నుంచి నడుస్తూ) ముంబాయికి చేరు కుంది. అక్కడ స్థిరమైన నివాసం లభించకున్నా బావూ తన చాలీ చాలనీ జీతంతో ఒక పూరి గుడిసెలో కా లం వెళ్ళబుచ్చి కుటుంబాన్ని పోషించుకున్నా డు. అన్నాబావు ముంబా యిలో తండ్రికి ఆర్థిక సహకారం నిమిత్తం నానా రకాల పనులు చేశాడు.

చివరికి బట్టల మిల్లులోనూ చేరా డు. అప్పుడే బట్టల మిల్లు కార్మికుల కోసం సంఘాలు స్థాపిస్తూ కమ్యునిస్టు పార్టీ బలమై న ఉద్యమాన్ని నిర్మించసాగింది. అన్నాబావు కు కమ్యునిస్టు భావాలు గల వ్యక్తులు పరిచయమయ్యారు. ఆయనలోని సాహిత్య కళను గుర్తించి వెలికి తీయడానికి సహకా రం అందించారు. బాల్యం నుంచే నాటకాలు, గేయాలు, జానప ద సాంస్కృతిక ప్రదర్శనలలో విశేష ఆసక్తి ఉన్నందున అన్నాబా వు సాహిత్య, సాంస్కృతిక రంగాలను ఎంచుకుని తొలి రచనకు ఉపక్రమించాడు.ఆ కాలంలో ముంబాయిలో కమ్యునిస్టుల నేతృత్వంలో సభలు, సమావేశాలు, సమ్మెలు, ధర్నాలు సాగేవి.గోడలపై రాతలు మొదలు నినాదాలు చేసే వరకూ అన్నింటిలో అన్నాబావు పాల్గొన్నాడు.మార్క్సిజం ప్రభావంతో పూర్తికాలం ఉద్యమ కార్యకర్తగా పని చేయడం ప్రారంభించాడు. ఉద్యమం లో తన ఆలోచనా ధోరణి విస్తరించి సాహిత్య సాంస్కృతిక రంగాలలో అగ్రశ్రేణికి చేరాడు.

‘జగ్‌ బదల్‌ ఘాలునీ సాంగూన్‌ గేలే మలాభీమ్‌రావ్‌’ గీతం అన్నాబావు రాసిన అన్ని గేయాలలో ప్రసిద్ధి చెందింది. దీని అర్థం ‘ప్రపంచాన్ని మార్చివేయమని నాకు నా భీమ్‌రావ్‌ (డా అం బేడ్కర్‌)చెప్పి వెళ్ళాడు’. క్రియాశీల కమ్యునిస్టు కార్యకర్త గా ఉన్న బావూ దళితుల పట్ల, వెనుకబడిన బలహీనవర్గాల పట్ల, కుల వివక్ష పట్ల ఝుళిపించిన కలం అగ్రకుల వర్గాల దోపిడీ గుండెల్లో అల్లకల్లోలం సృష్టించింది.అన్నాబావును ఒక రాజ కీయ కార్యకర్తగా కంటెగొప్ప సాహిత్యకారుడిగా మరాఠీ ప్రజ లంతా గుండెల కద్దుకుంటారు. భారత దేశ సాహిత్యంలో ఇంతవరకు ఏ ఒక్కరూ- కవి, రచయిత, నాట కకర్త, వాగ్గే యకారుడు, విమర్శకుడు వంటి అనేక విభిన్న రూపాను సమగ్రంగా అందుకొని ఎదగలేక పోయారు.కానీ అన్నా వారికి విరుద్ధంగా అద్భుత కళా సాహిత్యాన్ని సృష్టించ గలిగాడు.

అన్నాబావు రాసినవి 32 నవలలు. వాటిలో ప్రతి ఒక్కటి ఆణి ముత్యమే. వాటిలో దాదాపు 7 నవలల ఆధారంగా మరాఠీలో సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ బాక్సాఫీసులో హిట్టయ్యా యి. అందులో ‘ఫకీరా’ నవల కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా మరాఠీ సాహితీ పాఠకలోకాన్ని ఊర్రు తలూగించిన కథ. అందులో హీరో దోపిడీ దొంగ. గ్రామాల్లో పేదలపై జరిగే అన్యాయాలను సహించలేక సాయుధుడై పీడకు లను గజగజ వణకిస్తూ అడవిలో మకాం చేస్తాడు.

సరిగ్గా ‘రాబిన్‌ హుడ్‌’ వలె భూస్వాముల, ధనవంతుల ధాన్యాన్ని, డబ్బును దోచుకుని గ్రామీణ పేద జనానికి పంచి పెడతాడు. కథ చివరలో పట్టుబడి ఉరిశిక్షకు గురి అయినా తను ఎంచుకున్న మార్గంలో తప్పులేదని, భవిష్యత్తు పరిణామాలకు తానొక మార్గదాతనని చాటి చెబుతాడు. ఇలా అన్నా రాసిన ప్రతి నవలలో ఏదో ఒక సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశం ఉండడం విశేషం. ప్రేమ, కుటుంబ కలహాలు, ఆర్థిక గొడవలు, రాజకీయాలు- ఒకటేమిటి విభిన్న మనస్తత్వాలతో పీడితుల పక్షాన నిలబడి వాటికి ఆలోచింపచేసే, ఆశ్చర్యపరిచే రీతిలో తుది రూపాన్ని సృష్టించడం ఆయన గొప్పద నం. అన్నాబావు రాసిన కథలు 22. వీటిలో అమృత ఆబీ నుంచి స్వప్న సుం దరి వరకు ప్రతి కథా గొప్పదే. ఆయన శిల్పం, శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే.

అంత తక్కువ చదువుతో, అం త తక్కువ సమయంలో ఆయన ఎలా ఎదిగాడన్నది ఎందరో పరిశోధకులను సైతం ఆలోచింపజేసిన అంశం. అన్నా బావు మాములు కథకుడు నవలాకారు డే కాదు గొప్ప నాటకకర్త, జన నాట్య కార్యకర్త. అన్నాబావు రాసిన గొప్ప నాటకాలలో అతి ముఖ్య మైనవి 16. వాటిలో ఎన్ని కల మోసం, దేశభక్తి మో సం, నాయకుడు దొరికిండు, ప్రజాస్వామ్య యాత్ర వంటి నాటకాలు విరివిగా ప్రదర్శితమై జనాన్ని ఎంతో ఆకర్షించాయి.

అన్నాబావు రాసిన పద్యాలలో ‘షాహీర్‌’ (వాగ్గేయ కారుడు) మరాఠా ఆ బాల జనానికి ఎంతో నచ్చిం ది. అన్నాబావు స్వయంగా గానం చేస్తూ స్టేజీ పై ప్రదర్శన ఇచ్చి లక్షలాది జనం చేత ‘షాహీర్‌ అన్నా బావు’గా, ‘వాగ్గేయకారుడిగా’ పేరు గడించాడు. ఆయన జానపద కళా సాహిత్య కృతులలో ప్రధానమైనవి 1. పోవడా (ఒగ్గుకథ), 2. లావిణీ (స్ర్తీల నృత్యం), 3. పదే, 4. గీతే, 5. చక్కడ్‌. పోవడాలలో 9 అతి ప్రధానమైనవి. మొదటిది 1942లో వ్రాసిన స్టాలిన్‌గ్రాడ్‌ ఒగ్గుకథ. రెండవది బంగాళ్‌ హాక్‌. జులై 23, 1944లో రాశాడు. అలా బర్లిన్‌ చీ పోవడా, పంజాబ్‌, ఢిల్లీ అల్లర్లు 1947లో రాశాడు.ఆ తర్వాత 1947 లోనే తెలంగాణ సమస్య స్పష్టమైన రాజకీయ అవగాహనతో ‘తెలంగాణ సాయుధ పోరాటాన్ని’ సమర్థిస్తూ నిజాం రజాకార్ల దారుణ అత్యాచారాలను ఎండగ డుతూ బలమైన గీతాలతో, సంభాషణలతో ‘తెలంగాణ పోరా టం’ ఒగ్గుకథ రాశాడు.

వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. బహుశ మన నాజర్‌, సుంకర సైతం అంత విస్తృతంగా తిరిగి (నిర్బధం వల్ల) ఆ కాలంలో ప్రచార ప్రదర్శనలు ఇచ్చి ఉండక పోవచ్చు. ఆ తర్వాత ముంబాయి మిల్లు కార్మికులపై, నల్లబజారుపై అమర వీరులపై 1949 వరకు ఎన్నో నాటికలు రాసి స్వయంగా తనే ప్రదర్శన ఇచ్చే వాడు. ఆయన గొంతు గంభీరమై నందున చిన్ననాడు గానం, నృత్యం, నటన, పఠనం నేర్చుకున్నందున సాధన సులభమెంది.

కమ్యునిస్టు ప్రజానాట్య సంస్థ తరపున పని చేసినందున అందులో అమర్‌శేఖ్‌, గవన్‌కర్‌ లాంటి గొప్ప ప్రజా నాట్య కళా మండలి లభించడం వలన అన్నా అగ్రశ్రేణి స్థాయికి దూసు కు వెళ్ళగలిగాడు. దళిత కుటుంబంలో పుట్టినందున కొంత వరకు సాంప్రదా య మార్క్సిజంను వదులుకున్నాడు. అన్నాకు ఇప్టా (ఐ.పి.టి.ల)తో అనుబంధం వల్ల ముంబాయి హిందీ సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ నటుడిగా ప్రసిద్ధి చెందిన బలరాజ్‌ సహాని, ఎ.కె.హంగల్‌ వంటి ప్రముఖ నటులతో దగ్గరి సంబంధం ఉండ ేది. ఆ కాలంలో వెలువడే బ్లిట్జ్‌ సంపాదకుడు కె.ఎ.అబ్బాస్‌ నిర్మిం చిన చిత్రాల్ని సమీక్ష చేస్తూ అన్నా వ్యాసాలు సైతం ప్రముఖ దిన పత్రికలలో రాసేవాడు. ఆయన విలేకరిగా ఎన్నో నాళ్ళు పని చేసాడు. దానితో బాటు వివిధ పత్రికలో విస్తృత స్థాయిలో- సమ్మెలు, అత్యాచారాలు, దోపిడీలు, లంచగొండితనాలపై, రాజ కీయ, ఆర్థిక అంశాలపై ప్రత్యేక కథనాలు రాసేవాడు.

prbhakar ఇంతటి సమగ్ర ఆలోచనా ధోరణిలో ఉన్న సాహితీ వేత్త, బహుశా భారత దేశ సాహిత్యంలో అరుదు. అందుకే ఆయనను సోవియట్‌ యూనియన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించ డం జరిగింది. ఆయన సాహిత్యం భారతదేశ భాషలలో బాటు చెక్‌, పోలిష్‌, రష్యన్‌, జర్మన్‌, స్లోవక్‌, ఇంగ్లీష్‌ వంటి 14 భాషల్లోకి అనువాదమయ్యాయి. లాల్‌ బావుటా వీధి నాటక సం స్థల ద్వారా అన్నా బావూ రచయితగా, అభినయకర్తగా, దర్శకుడ ిగా ఎంతో అను భవం గడించాడు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో, కార్మిక వర్గ పోరాటాల్లో, వివిధ సామాజిక న్యాయ ఉద్యమాల్లో క్రియాశీల కర్తగా పాల్గొంటూ ఒక అగ్రశ్రేణి సాహిత్యవేత్తగా, కళాకారుడిగా రూపొందిన అన్నాబావూ సాఠే భారతదేశ సాహిత్యానికి మార్గదర్శి. తెలుగులో అన్నా సాహిత్యం లేని లోటు తీరలేనిది. దానిని త్వరలోనే తెలుగు- మరాఠి సాహిత్యకారులు పూడ్చగలరని ఆశిద్దాం.

vyasam

( మన కాలపు మహాకవి మహమూద్ దర్వీష్ ఇక లేరు.ఆయన ఈ నెల (9 ఆగష్టు 2008) తొమ్మిదో అమెరికాలోని హూస్టన్ లో కన్నుమూశారు.ఆయన స్మృతికి నివాళి ఇది)
కవిత్వపాదాలు ఆకాశానికి రాసుకున్న ప్రేమలేఖల్లాంటివని ఎప్పుడో రాసుకున్నాడు ఖలీల్ జిబ్రాన్ .కానే కాదు…… కవిత్వ పాదాలు పుట్టిన నేలకి రాసుకున్న ప్రేమలేఖలని జీవితంలోని చివరి క్షణం దాకా చెప్పుకుంటూ . కవిత్వం నిండా సొంత వూరి ఙ్ఞాపకాల పరిమళాల్మి నింపిన వాడు మహమూద్ దర్వీష్.
కవిత్వపాదాలు మట్టిలోంచి మొలుచు కురావాలని . తిరిగి మట్టిలోకే చేరుకోవాలని గట్టిగా నమ్మిన పాలస్తీనా మహాకవి దర్వీష్ . ఇజ్రే ల్ లో ఓ మధ్య తరగతి ముస్లిం రైతు కుటుంబంలో పుట్టిన దర్వీష్ కుటుంబానికి చిన్న పాటి పొలాలే సర్వసంపద. దర్వీష్ కి ఆరేళ్ళ వయసులో ఇజ్రేల్ ప్రభుత్వం ఆధి పత్యం కోసం అతని వూరంతా ధ్వంసం చేసింది. వూరు వూరంతా వల్లకాడయ్యింది. దిక్కు లేని పక్షుల్లా ప్రాణాలు అరచేతి పట్టుకుని దొంగదారిన లెబనాన్ చేరింది దర్వీష్ కుటుంబం.అక్కడి నుంచి మొదలైంది దర్వీష్ వలస బతుకు. అతనే ఒక కవితలో రాసుకున్నాడిలా-
ఎప్పటికీ నేను అక్కడి వాణ్నేఅక్కడే నా ఙ్ఞాపకాలన్నీ వున్నాయి.అందరిలానే పుట్టాను నేను ఆ వూళ్ళో.నాకూ ఓ తల్లి వుందిబోలేడు కిటికీలున్న ఇల్లుందితోబుట్టువులూ స్నేహితులూ వున్నారునాకూ ఓ జైలు గది వుందిఅతి చల్లని కిటికీలు బార్లా తెరుచుకున్న గది
ఒకే ఒక మాట మిగిలిపోయింది - సొంతూరు.ఆ ఒకే ఒక్క పలుకు కోసంఅన్ని నియమాల్ని తుంగలో తొక్కానుఅన్ని మాటల్నీ ధ్వంసం చేశానుఒకే ఒక్క మాట కోసం-సొంతూరు.
పుట్టినూరు పరాయిదైపోయింది . సైనిక పదఘట్టనల కింద నలిగిపోతున్న నేలతల్లి నెత్తుటి కనుకొలకుల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు అతన్ని ఎక్కడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. నిరంతర అవిశ్రాంత యోధిడిలా అతను చారెడు నీడ కోసం దేశదేశాలూ సంచరించాడు దిక్కులేని పక్షిలా. అతని కవిత్వపాదాల సింహనాదాలకు భయపడి , రాజ్యం అతన్ని వెలివేసింది. గతవారం అమెరికాలోని హుస్టాన్ లో అతను కన్నుమూసేదాకా రాజ్యం కంటి మీద కునుకులేదు. మహమూద్ దర్వాష్ ఇక లేడన్న మరణవార్త విన్న నేలతల్లి పాలస్తీనా గుండె తల్లడిల్లింది. చివరి క్షణం దాకా ఎత్తిన కలం దింపకుండా కలానికి ఒక దేశపు జెండా కుండాల్సినంత పొగరునీ , శక్తినీ అందించిన కవి దర్వీష్. అందుకే అతని ప్రతి పలవరింతా . ప్రతి కలవరింతా జన్మభూమి ఆత్మఘోషగా మారిపోయింది. కాని , కవిత్వంలో అంతర్ముఖత్వానికీ , బహిర్ముఖత్వానికీ నికార్సయిన ఎల్లలు గీసుకున్న కవి దర్వీష్. అతని కవిత్వం చండ్ర నిప్పులు చెరిగిన క్షణాలు వున్నాయి. మంచు తునకల్ని ముఖమ్మీద చిలకరించిన క్షణాలు వున్నాయి. నిరసన నిరసనే . అట్లాగని, నా అనుభూతిని ఎందుకు దాచుకోవాలి? ‘ అంటూ కవిత్వపాదాల్ని తూనీగల నడకల మృదుత్వంతో పోటీపడేట్టు తీర్చిదిద్దిన అందమైన శిల్పి దర్వీష్. ఎప్పటికైనా ఎవరినైనా నా కవిత్వ పాదం దాని కవిత్వ శక్తి వల్లనే బతుకుతుంది. అందులోని వస్తువు కొంతకాలానికి నీరసించినా సరే..’ అని పదేపదే చెప్పుకున్నాడు దర్వీష్. కదనరంగానికీ, కవిత్వానికీ మధ్య సూది మొన అంతటి ఆ సున్నితమైన తేడాని గుర్తించి. ఆ గుర్తింపు ప్రతి కవితలోనూ కనబరిచి, కవిత్వ శక్తి ముందు ఏ శక్తి అయినా బలాదూరేనని రుజువు చేసినవాడు దర్వీష్.
సూట్ కేసే నా స్వదేశం
దర్వీష్ కవిత్వంలో అత్యంత బలంగా కనిపించేది మాతృభూమి భావనే. ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ప్రవాసశిక్ష పడింది దర్వీష్ కి.’ ఆ తరువాత సూట్ కేసు మాత్రమే నా సొంతదేశం అయింది . సంచారమే నాకు మిగిలింది ‘ అంటాడు దర్వీష్. అతని కమ్యూనిస్టు రాజకీయాలు, అతని కవిత్వపాదాల అగ్రహమూ అతన్ని ఎక్కడా క్షణం సేపు ప్రశాంతంగా వూపిరాడనివ్వలేదు. చివరికి తండ్రి చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకి హాజరుకావడానికి అనుమతి దొరకలేదు. కాని, చాలా కాలం తరవాత ఒక డాక్యుమెంటరీ కోసం నాలుగు రోజుల పాటు పుట్టి వూరికి వెళ్ళడానికి ఇజ్రేలీ ప్రభుత్వం అతనికి అనుమతించింది. ఆ నాలుగురోజులూ దర్వీష్ జీవితంలో మరచిపోలేని స్మృతులు. అప్పుడే సమాధిలో చిరనిద్రలో వున్న తండ్రిని చివరిసారి చూసుకున్నాడు దర్వీష్.ఆ నాలుగు రోజులూ నేను పసిపిల్లాణ్నయిపోయాను. నేను చిన్నప్పుడు ఆడుకున్న చెట్టూ చేమలన్నీ నాకు గుర్తే. వాటిని మనసారా చేతులతో తడిమాను. వాటిని కావిలించుకుకునిఏడ్చాను. నేను కూర్చున్న ప్రతి రాయి మీదా మళ్ళీ కాసేపు కూర్చున్నాను. నా చిన్నతనాన్ని తలుచుకున్నాను. మళ్ళీ ఆ రోజులు వస్తాయా అని కాసేపు కాలంలోకి ఆశగా చూశాను. అంత పరవశం నాకు ఎప్పుడూ కలగలేదు. ఆ నాలుగు రోజులూ మళ్ళీ రావు కదా ?’ అని రాసుకున్నాడు దర్వీష్. నిజానికి ఆ నాలుగు రోజులు ఎప్పటికీ అతని జీవితంలో తిరిగిరాలేదు.దర్వీష్ గొంతు నిండా ఒక పట్టరాని కోపం నిండుకుపోయి వుంటుంది. ఒకోసారి చాలా ప్రాశాంతంగా సెలయేటి ప్రవాహంలాగా వెళ్ళే పద్యం . మరింకోసారి వున్నట్టుండి కట్టలు తెగిన ఏరులా వూళ్ళన్నిటినీ విపరీతాగ్రహంతో ముంచెత్తుతుంది.
1960 లో రాసిన కవిత ఇది-
రాసుకోనేను అక్షరాల అరబ్బువాణ్నినా గుర్తింపు కార్డు నెంబరు 50,000నాకు ఎనిమిది మంది సంతానం.తొమ్మిదోది ఈ ఎండాకాలంపుట్టబోతోంది.మొదటి పుటలో స్పష్టంగా రాసుకోనేను ప్రజల్ని ద్వేషించను
ఎవరి ఇలాకాలోకి జొరబడనుకానీ , ఆకలేసిందా,నీ కండల్నే కొరుక్కుతింటానుజాగ్రత్త, జాగ్రత్తనా ఆకలి మహా ప్రమాదకరమైందినా ఆగ్రహం మరీ మరీ ప్రమాదకరమైంది.
రెండు దశాబ్దాల పాటు దర్వీష్ కవిత్వం ఇదే ఆగ్రహంతో వూగిపోయింది. అరాఫత్ నాయకత్వంలోని పాలస్తీనా జాతీయోద్యమం అతని ఆశలకి ప్రతిరూపమైంది. అతని కవిత్వ ఆవేశానికి ఒక రూపాన్నిచ్చింది. ఉద్యమంలో అతను కీలకభాగస్వామి అయ్యాడు. 1974 లో అరాఫత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన చరిత్రాత్మకమైన ప్రసంగంలోని మొదటి పంక్తి దర్వీష్ దే. ఒక ఆలీవ్ ఆకునీ , ఒక స్వాతంత్ర్య యోధుడి తుపాకినీ భుజాన్నేసుకుని వచ్చాను. ఆ ఆలీవ్ ఆకుని నా చేతుల్లోంచి జారిపోనివ్వకండి ‘ అన్న ఆ వాక్యం ఎన్నో విధాలుగా దర్వీష్ కవిత్వం ఒక రాజీపడని గొంతుక. కవిత్వంలో నానార్థాల పెడర్థాల గందర గోళాన్ని అతను ఎప్పుడు సహించలేదు. ప్రతీకలు దారితప్పడాన్ని అతను ఏనాడూ భరించలేదు . అందుకే - తన కవిత్వంలో అమ్మ అన్న మాట వచ్చినప్పుడల్లా ఆ పదాన్ని పాలస్తీనాకి ప్రతీకగా భావించే ధోరణిని అతను విమర్శించేవాడు. అమ్మ అంటే అమ్మీ. ఆ అమ్మ అచ్చంగా నా తల్లి మాత్రమే . అది దేశమూరాదు.ఇంకో ఆవేశానికి ప్రతీకా కాదు. కేవలం నా వ్యక్తిగతం. నా కవిత్వాన్ని ఒకే విధంగా చదవడం అలవాటయ్యి. అందరూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. కాని, నా కవిత్వానికి అనేక వ్యాఖ్యానాలు లేవు. ఒకే ఒక్క అర్థం వుంది ‘ అని చెప్పేవాడూ దర్వీష్ . ఒక్క మాటలో చెప్పాలంటే - దర్వీష్ కవిత్వాన్నే ఒక యుద్ధభూమిగా ప్రేమించాడు. నిరంతర వలసల మధ్య పుట్టిన వూరు ఒక కలగా మారిపోయిన కవిత్వాన్ని రాసుకున్నాడు . కాని , అతని ప్రతి కవితా ప్రపంచం తన కవితగానే పాడుకుంది. అతని వ్యక్తిత్వంలో ప్రపంచం తన ప్రతిబింబాన్నే వెతుక్కుంది. ఎక్కడ ఏ భూపోరాటం జరిగినా, ఆ పోరాటానికి అతని అక్షరాలు ఆయుధాల్ని అందించాయి.
దర్వీష్ మాటల్లోనే చెప్పాలంటే-
నా పదాలు గింజలయితేనేను నేలని.నా పదాలు పట్టరాని ఆగ్రహమయితేనేను పెనుతుపానుని.నా పదాలు రాళ్లయితేనేను నదిని.నా పదాలు తీయతేనియలయితేనా పెదాలు తేనెటీగల గూళ్ళు.

Thursday, September 30, 2010

ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్హలో హలో...మీ సినిమా థియేటర్ లోబాంబ్ పెట్టాము...అది మరికొద్ది క్షణాల్లోపేలిపోతుంది!ప్రాణం పై ఆశ ఉన్నవాళ్ళుపారిపోవచ్చుపరిగెత్తరానివారు తోపులాటల్లో పడి చావచ్చు!సరదాకి కూడనగరంలోకి వెళ్ళితే అనుకోని అతిథిలా మరణం మిమ్మల్నిఆహ్హానిస్తుంది!వాన రాకడ ప్రాణం పోకడ ఇపుడు బట్టలు మార్చి నంత సులువు.ప్రభువా వీళ్ళను క్షమించు.వీరేమి చేసున్నారో వారికి తెలియదు!సెల్ ఫొన్ బాంబ్ లతోక్షణంలో మీ శరీరం శకలాలుగా మిగులుతుంది!కాబట్టి తస్మాత్ జాగ్రత్త.బ్రతకాలంటే ఇప్పుడు నాలుగుకళ్ళు ఉండాల్సిందే!

Wednesday, September 15, 2010

  • పైశాచికత్వం కౄరంగా కాటువేసినప్పుడుఎన్ని అమాయకపు జీవితాలు..ఎన్ని అందమైన కలలు..ఎన్ని ఉన్నత ఆశయాలు..ఎన్ని లేత నవ్వులు..ఎన్ని ఆనందపు క్షణాలు..అంతమైపోయినవో కదా!కటిక పస్తులుండికన్నకొడుకుని చదివించికొత్త ఉద్యోగంలో కొడుకుని చూసిపస్తులేని రోజుల్ని కలలు కన్నఓ.. వెర్రి తల్లీ! నీ కోడుకునీ శరీరంలోని మాంసపు ముద్దనీ కన్నపేగు.. ఇప్పుడు నిజంగానే..మాంసపుముద్దగా.. పేగులగుట్టగా మారిఆసుపత్రి మార్చురీలో..శవాల గుట్టల మధ్య..ఆనవాలు లేకుండా ఉన్నాడు.ఎందుకీ ఘోరం.. ఎవరిదీ పాపం..అంతా అయిపోయింది..అవును..క్షణాల్లో.. అంతా అయిపోయింది.ఇక ఏడవకు తల్లీ..!ఏడ్చి మాత్రం సాధించేదేముందిలే!?ఇలా అన్నందుకునన్ను క్షమించు తల్లీ!నాకేం ఓదార్పు మాటలు ఎన్నైనా చెపుతాను.కాని.. కాని.. కాని..గర్భశోకం ఎవరిది తల్లీ!?నీది కాదా....!అవును నీదే కదా..!అందుకే ఏడువు..బాగా ఏడువు..గుండెలు పగిలేలా ఏడువు..కన్న తల్లుల కడుపు తీపిచల్లారేలా ఏడువు..ఈ పైశాచికపుఇ మారణహోమాలుణి కన్నీటితో తడీసి ఆరిపోయేలా..ఈ ఆటవిక కౄరచర్యలునీ ఆర్తనాదాలు విని ఆగిపోయే దాకా..ఏడువు...ఇంకా ఏడువు..ఏడువు..
మాదక ద్రవ్యాల ముప్పు
- పిల్లల్లో సైతం వ్యాపిస్తున్న వ్యసనం- కేవలం చట్టాలే నిరోధించలేవు- డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారం ఎంతో ముఖ్యం - దేశంలోనూ అధికసంఖ్యలో వ్యసన బానిసలుభామాదక ద్రవ్యాలు యన యువత భవితను బలి తీసుకుంటున్నాయి.. ముఖ్యంగా ముంబాయి నగరం మాదక పదార్ధాల కేంద్రంగా పనిచేస్తున్నది. బ్రౌన్‌ షుగర్‌ వంటి మత్తు పదార్ధాలను యువతీ యువకులు ఇంజెక్షన్ల ద్వారా తీసుకొంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఈ వ్యసనం పెరిగిపోతున్నది. ఎయిడ్స్‌ వ్యాధి కూడా ఆ ప్రాంతాలలోనే భయంకర స్థాయిలో ఉన్నది. ఇంక కొన్నేళ్ళకు దేశంలో మాదక ద్రవ్యాలను సేవించేవారి సంఖ్య కోటి, కోటిన్నర మందికి చేరుకోవచ్చునని ప్రస్తుత అంచనా. ఈ వ్యసనం ఇప్పటికి మాత్రం నగరాలకే పరిమితమై ఉంది. దీన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించి జాతి మొత్తాన్నే నిర్వీర్యం చేయడం తథ్యం. మత్తు పదార్ధాల వ్యసనానికి బానిసలు అయిన అయిన వ్యక్తులు జీవచ్ఛవాల వంటివారు. యువతీ యువకులే కాదు, పిల్లలు కూడా ఈ వ్యసనానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది కేవలం ఆనందంకోసం మాదక ద్రవ్యాలు సేవిస్తారు. కొంతమంది ‘సాహస’ భావంతో ఈ వ్యసనానికి శ్రీకారం చుడతారు. వీటి వినియోగం ఒక్కసారి అలవాటయ్యాక ఇక బయట పడడం కష్టం.చుట్టూ చక్కటి వాతావరణం లోపించినప్పుడు మాదక ద్రవ్యాలు పరిష్కారంగా కొందరికి కనిపిస్తాయి. చేతినిండా డబ్బు ఉండడం వల్ల కూడా ఈ వ్యసనం ఏర్పడవచ్చు. కేవలం చట్టాలతోనే ఈ వ్యసనాన్ని నిర్మూలించలేము. ప్రచారం కూడా సాగాలి. 1987- 94 మధ్య ‘కొకెయిన్‌’ ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది. వరంగల్‌ వంటి జిల్లాలలో మూడు, నాలుగు ఎకరాల భూమిలో గంజాయి పండిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 1944లో 7900 టన్నుల గంజాయి ఉత్పత్తి అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 కోట్ల అమెరికా డాలర్ల విలువ చేసే మత్తు పదార్ధాల్ని సేవిస్తున్నారు. అమెరికా జాతీయోత్పత్తిలో ఇది 10 శాతం. మాదక ద్రవ్యాల దుష్ర్పభావాన్ని ప్రపంచానికి తెలియచెప్పడం కోసం ఐక్యరాజ్య సమితి 2000 దశాబ్దాన్ని మాదక ద్రవ్యాల వ్యతిరేక దశాబ్దంగా పాటించింది. ఈ దశాబ్దంలో వీటిని అరికట్టడానికి ప్రపంచ దేశాలమధ్య సహకారం గణనీయంగా పెరిగింది. డ్రగ్స్‌ నిరోధానికి చట్టబద్ధమైన చర్యలు కొన్ని తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు రావడం లేదు. 1985 ఏప్రిల్‌లో భారత పార్లమెంటు ‘నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకో ట్రాఫిక్‌ సబ్‌స్టెన్స్‌ యాక్టు’ను రూపొందించింది.మత్తుపదార్ధాల అక్రమ రవాణాను అరికట్టేందుకు 1986లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. మొత్తంమీద ఈ విషయంలో అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తీసుకుంటున్నంత కఠిన చర్యల్ని ఇండియా తీసుకోవడం లేదు. భారత సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 1944లో మొత్తం 11 లక్షల 28 వేల మంది డ్రగ్స్‌ బానిసలు నమోదు చేయించుకుని ఉన్నారు. వారిలో 44 శాతం మంది చిన్నవయస్సువారు. మొత్తం బానిసల్లో 4.54 శాతం మంది 12-15 సంవత్సరాల లోపు వారు.13.86 శాతం మంది 18-23 సంవత్సరాల లోపు, 30 శాతం 24-30 సంవత్సరాల లోపు, 35 శాతం మంది 31- 45 సంవత్సరాల లోపు వయస్సువారు. 13.1 శాతం మంది 46-60 సంవత్సరాలలోపు వారు కాగా 3.5 శాతం మంది 60 సం పైబడినవారు. అయితే, అదే సంవత్సరం అంతర్జాతీయ నార్కోటిక్స్‌ బోర్డు లెక్కల ప్రకారం ఇండియాలో 25 లక్షల మంది డ్రగ్స్‌ బానిసలున్నారు.డ్రగ్స్‌ బానిసల వృత్తుల్ని పరిశీలిస్తే, వారిలో 17.93 శాతం మంది చిన్నవ్యాపారులు, 17.25 శాతం మంది వ్యవసాయదారులు. 13.5 శాతం మంది రోజు కూలీలు. 11.52 శాతం మంది ప్రభుత్వోద్యోగులు.10.57 శాతం మంది వ్యవసాయ కార్మికులు. 3.3 శాతం మంది రిక్షా- ఆటో నడిపేవారు. 1.47 మంది వృత్తి నిపుణులు. వీరిలో 47 శాతం మంది నిరక్షరాస్యులు కాగా, 3.95 శాతం పి.జి.వరకూ చదివినవారు. డ్రగ్స్‌, మద్యపానం దురలవాట్లను నివారించడానికి 1999 లో 368 ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహాయం అందజేశారు. దాంతో వారు 160 డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ కేంద్రాలను, మరో 60కి పైగా చికిత్స, పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. నార్కోటిక్స్‌ అండ్‌ సైకోట్రాఫిక్‌ సబ్‌స్టెన్స్‌ చట్టం కింద డ్రగ్స్‌ నేరాలకు కఠిన శిక్షలు విధించే వీలు కల్పించారు.డ్రగ్స్‌ నేరాలకు 10 సంవత్సరాల కఠినకారాగార శిక్ష, కనీసం రూ.లక్ష జరిమానా విధిస్తారు.తిరిగి అదే నేరం చేస్తూ పట్టుపడితే 15సం. జైలు శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తారు. ఇటువంటి కేసుల్లో 30 సం. జైలు శిక్ష, రూ.3 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. తిరిగి అదే నేరంచేస్తే మరణశిక్ష విధించవచ్చు. వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే డ్రగ్స్‌ స్పల్ప స్థాయిలో కలిగిఉన్నట్టు రుజువైతే స్వల్పశిక్షతో బయట పడవచ్చు.
- ఏడాకులపల్లి వెంకటేష్‌
More From Edit Page